చంద్రశేఖర్‌తో 'మైత్రి'కి సిద్ధమంటోన్న శ్రియ!

మరిన్ని వార్తలు

విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి ఓ విభిన్నమైన హీరోయిన్‌ సెంట్రిక్‌ స్టోరీని ప్రిపేర్‌ చేశాడట. ఆ సినిమాలో నటించేందుకు శ్రియతో సంప్రదింపులు చేస్తున్నారట. విభిన్న కథలకు దృశ్య రూపమివ్వడంలో చంద్రశేఖర్‌ ఏలేటి సిద్ధహస్తుడు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ కోసం అస్సలు ఆలోచించడీ వెర్సటైల్‌ డైరెక్టర్‌. అందుకే ఆయన నుండి 'ఐతే', 'సాహసం', 'మనమంతా', ప్రయాణం' వంటి సినిమాలొచ్చాయి. త్వరలో ఓ యంగ్‌ హీరోతో చంద్రశేఖర్‌ ఏలేటి ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. అయితే ఆ హీరో ప్రస్తుతం బిజీగా ఉండడంతో, ఈ గ్యాప్‌లో చంద్రశేఖర్‌ ఏలేటి మెదడులో మెదిలిన మరో ఆలోచనను ఆచరణలో పెట్టనున్నాడట. అదే హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న సినిమా అనీ తెలుస్తోంది. ఆ సినిమాకే శ్రియ శరణ్‌ని పరిశీలిస్తున్నారట.

 

ఈ సినిమాని మైత్రీ మూవీస్‌ వారు నిర్మించే అవకాశాలున్నాయనీ సమాచారమ్‌. కథ విషయానికి వస్తే, 10 ఏళ్ల అమ్మాయికి తల్లిగా శ్రియ నటించబోతోందట. ఈ మధ్య విదేశీ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ, సినిమాల నుండి కాస్త గ్యాప్‌ తీసుకుంది శ్రియ. నిజానికి 'ఎఫ్‌ 2'లో వెంకటేష్‌ సరసన శ్రియ నటించాల్సింది. కొన్ని కారణాలతో శ్రియ ప్లేస్‌లోకి తమన్నా వచ్చి చేరింది. ఇక ప్రస్తుతం ప్రచారంలో ఉన్న చంద్రశేఖర్‌ ఏలేటి సినిమా ఓకే అయితే, త్వరలోనే శ్రియ మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర కానుంది. మరోవైపు నిహారిక, శ్రియ కాంబినేషన్‌లో ఓ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ ఆ మధ్య వార్తల్లో నిలిచింది. ఆ సినిమా స్టేటస్‌ ఏంటో తర్వాత తెలియ రాలేదు. చూడాలి శ్రియ యాక్టివ్‌ అయితే, ఈ ప్రాజెక్టులన్నీ ఓ కొలిక్కి వస్తాయేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS