శృతి మళ్లీ విజృంభిస్తుందా?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో వరుస విజయాలతో టాప్‌ హీరోయిన్‌ ఛైర్‌ని అధిరోహించిన శృతిహాసన్‌ పేరు ఈ మధ్య పెద్దగా వినిపించడం లేదు. 'కాటమరాయుడు' సినిమా నిరాశ పరచడంతో శృతిహాసన్‌ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత. అలాగే శృతి కూడా ఎందుకో టాలీవుడ్‌పై అంతగా ఇంట్రెస్ట్‌ చూపించలేదు. కానీ ఇప్పుడు శృతిహాసన్‌ మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధంగా ఉందట. 

ఈ మధ్య శృతి హాసన్‌ పెళ్లి చేసుకుని సెటిలైపోతుంది, అందుకే సినిమాలు చేయడం లేదనీ గాసిప్స్‌ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని శృతిహాసన్‌ ఖండించింది. తనకింకా చాలా కెరీర్‌ ఉందనీ, కెరీర్‌లో సాధించాల్సినవి చాలా ఉన్నాయనీ, అయితే జస్ట్‌ ఏ స్మాల్‌ బ్రేక్‌, చిటికలో వచ్చేస్తానని చెప్పి చాలా కాలంగానే రెస్ట్‌ తీసుకుంటోంది శృతిహాసన్‌. ఇంక రెస్ట్‌ టైం అయిపోయింది కాబోలు. సినిమాలపై దృష్టి పెడతానని చెబుతోంది. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఓ సినిమాకి శృతిహాసన్‌ సైన్‌ చేసిందంటూ సమాచారమ్‌ అందుతోంది. అది ఎంత వరకూ నిజమో తెలీదు కానీ, మొత్తానికి శృతి అయితే మళ్లీ ఛార్జ్‌ తీసుకుందని తెలుస్తోంది. 

టాలీవుడ్‌లో హీరోయిన్స్‌ కొరతతో ఎంతమంది కొత్త భామలు వస్తున్నా కానీ, వచ్చి పోయే మేఘాల్లా ఉంటోంది వారి కెరీర్‌. సీనియర్‌ భామలకు అవకాశాలు తగ్గడం లేదు. కాజల్‌ అగర్వాల్‌, తమన్నా తదితరులు అలాగే దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే శృతిహాసన్‌ కూడా సినిమాలు ఒప్పుకోవాలే కానీ, ఆమె కెరీర్‌కి ఏమాత్రం డోకా ఉండదు. అన్నట్లు శృతిహాసన్‌ చేతిలో 'శభాష్‌ నాయుడు' సినిమా ఉంది. తండ్రీ కూతుళ్ల సినిమా ఇది. తండ్రి కమల్‌ హాసన్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా మరి ఈ సినిమా సంగతి ఏమైందో తెలీదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS