శ్వేతా బసు ఎన్నాళ్లకెన్నాళ్లకు.?

మరిన్ని వార్తలు

నిన్న హైద్రాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్‌ పాల్గొంది. చాన్నాళ్ల తర్వాత హైద్రాబాద్‌లో కనిపించిందీ భామ. 'కొత్త బంగారు లోకం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. వస్తూ వస్తూనే బంపర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించింది కానీ, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. 

ఆ తర్వాత ఓ వివాదంలో ఇరుక్కుంది. సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత ఆమెకు చాలా మంది అవకాశాలిస్తామంటూ ఆశ చూపించారు. కానీ జరగలేదు. దాంతో పూర్తిగా సినిమాల నుంచి తప్పుకుంది. ఈ భామ కేవలం నటి మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్‌. కొన్ని సినిమాలకు స్క్రిప్టు అసిస్టెంట్‌గా పని చేసింది. ఓ మెగా సీరియల్‌లోనూ నటించింది. అవకాశమొస్తే తానేంటో మరోసారి నిరూపించుకుంటానంటోంది.

మంచి అవకాశాల కోసం చూస్తోంది. తెలుగు సినిమా అంటే తనకెంతో ఇష్టమని చెబుతోంది శ్వేతా బసు ప్రసాద్‌. తన మనసుకు నచ్చిన అవకాశాలు వస్తే తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేయాలని ఉందంటోంది. 'కొత్త బంగారు లోకం'తో క్యూట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరి మనసులు కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత కొంచెం బొద్దుగా మారి హీరోయిన్‌ ఫీచర్స్‌కి దూరమైంది. దాంతో హీరోయిన్‌గా ఆమెను స్క్రీన్‌పై చూడడానికి ఇష్టపడలేదు జనం. ఇప్పుడు కొంచెం సన్నబడి నాజూకుగా మారింది.  

చూడాలి మరి శ్వేతాబసు రీ ఎంట్రీలో ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో, ఎలా ఆకట్టుకోనుందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS