శ్యామల, నూతన్‌ రీ ఎంట్రీ వెనక ఎవరు?

మరిన్ని వార్తలు

బిగ్‌ బాస్ హౌస్‌లో తేజిస్వని వుంటే ఇంకా పరిస్థితి చేజారిపోతుందని మెజార్టీ వీక్షకుల అభిప్రాయంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులపై ఒత్తిడి రావడంతో అనూహ్యంగా తేజస్విని హౌస్‌ నుండి బయటికి పంపించేశారు. తేజు బయటికి వచ్చిన తర్వాత పూజా రామచంద్రన్‌ హౌస్‌లోకి వెళ్లింది. 

తేజస్వి బయటికి వచ్చినప్పటి నుండీ, ఎక్స్‌ సెలబ్రిటీస్‌లో ఎవరో ఒకరు బిగ్‌హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్త హల్‌ చల్‌ చేస్తోంది. వైల్డ్‌ కార్ట్‌ ఎంట్రీ ద్వారా బయటికి వచ్చిన వారి నుండి మళ్లీ లోపలికి వెళ్లే ఛాన్స్‌ వచ్చింది. అయితే బిగ్‌హౌస్‌ నుండి మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన సంజనను వైల్డ్‌ కార్ట్‌లో కూడా పెద్దగా ఎవరూ కన్సిడర్‌ చేయలేదు. కిరీటికి తక్కువ ఓట్లే పడ్డాయని తెలుస్తోంది. 

ఇకపోతే భానుశ్రీ ఓ గొడవ కారణంగా బయటికి వచ్చింది. అది అభ్యంతరకరమైన గొడవ. నిజానికి ఆ గొడవకు కారణం తేజు అయినా, బలయ్యింది మాత్రం భాను. సో ఆ కారణంగా భానుశ్రీకి కూడా తక్కువ ఓట్లే వచ్చాయట. అలా భాను ఛాన్స్‌ కోల్పోయింది. ఇకపోతే హౌస్‌ నుండి ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా బయటికి వచ్చిన వారు శ్యామల, నూతన్‌ నాయుడు. వీరిలో ఎవరో ఒకరు లోపలికి వెళ్తే హౌస్‌లో వాతావరణం సెట్‌ రైట్‌ అవుతుందని ఆడియన్స్‌తో పాటు, ముఖ్యంగా హౌస్‌ నిర్వాహకులు భావించారట. 

దాంతో ఒకరు కాదు, వీరిద్దరినీ హౌస్‌లోకి మళ్లీ పంపించేందుకు బిగ్‌బాస్‌ యూనిట్‌ నిర్ణయించుకుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాని ఆల్రెడీ వీరిద్దరి రీ ఎంట్రీని కన్‌ఫామ్‌ చేసేశాడు. ఇంతవరకూ ఏ సెలబ్రిటీకి రానన్ని ఓట్లు శ్యామల దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానం నూతన్‌ నాయుడుదే. ఆల్రెడీ ఆదివారం వీరిద్దరినీ బిగ్‌బాస్‌ స్టేజ్‌ మీదకు తీసుకొచ్చారు హోస్ట్‌ నాని. ఇక ఎనీ టైం వీరిని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపనున్నారు.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS