రెడ్డి గారి హీరోయిన్‌ 'జిగేల్‌' అనిపిస్తుందా.!

మరిన్ని వార్తలు

కమెడియన్‌ శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'జంబలకిడిపంబ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మోస్తరు అంచనాలను అందుకుంది. 

ఇకపోతే ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బ్యూటీ సిద్దీ ఇద్నానీ. తొలి సినిమాతోనే టాలెంట్‌ పరంగా మంచి మార్కులే వేయించుకుందీ అందాల భామ. 'జంబలకిడిపంబ' తర్వాత సిద్దీ ఇద్నానీ నటిస్తున్న చిత్రం 'జిగేల్‌'. అరుణ్‌ అదిత్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ యంగ్‌స్టర్‌ కూడా అందరికీ సుపరిచితుడే. 

'కథ' సినిమాతో ఈ కుర్రాడు హీరోగా తెరంగేట్రం చేశాడు. కానీ 'గరుడవేగ' చిత్రం అరుణ్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో రాజశేఖర్‌కి సపోర్టింగ్‌ రోల్‌ పోషించాడు అరుణ్‌ అదిత్‌. ఈ సినిమాతోనే ఆడియన్స్‌లో బాగా రిజిస్టర్‌ అయ్యాడు. ఇకపోతే తాజా సినిమా విషయానికి వస్తే ఇదో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం. అలాగే అన్ని రకాల కమర్షియల్‌ ఎలిమెంట్స్‌నీ ఈ చిత్రంలో మిక్స్‌ చేశారు. రిచ్‌ నిర్మాణ విలువలతో సినిమాని రూపొందిస్తున్నారు. అల్లం నాగార్జున నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. సెప్టెంబర్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. 

తొలి సినిమాతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సిద్దీ ఇద్నానీకి 'జిగేల్‌' మనిపించే హిట్‌ మరోసారి దక్కుతుందో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS