'మన్మధుడు 2' కోసం సోనాలీ బింద్రే.!

By Inkmantra - March 26, 2019 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న 'మన్మధుడు 2' లేటెస్ట్‌గా సెట్స్‌ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ క్లాసిక్‌ హిట్‌ అయిన 'మన్మధుడు' సినిమాకి సీక్వెల్‌ అంటే చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాల్ని అందుకోవడంలో యంగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ చాలానే కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికే కష్టపడి స్క్రిప్టు పనులు పూర్తి చేసేశాడు. 

 

ఈ సంగతిటుంచితే, అప్పటి మన్మధుడులో సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సోనాలీ బింద్రే క్యాన్సర్‌ మహమ్మారిని జయించి మళ్లీ సినిమాల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. క్యాన్సర్‌ బారిన పడి తాననుభవించిన బాధను సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుని, తనలా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఎంతో మందికి ఇన్‌స్ప్రేషన్‌ కలిగించేలా స్టేట్‌మెంట్స్‌ ఇచ్చింది. 

 

కాసేపు ఈ మ్యాటర్‌ కూడా పక్కన పెడితే, గతంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ తదితర సీనియర్‌ హీరోల సరసన ఆడి పాడి, ఎన్నో సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదింకే సినిమానో కాదు, 'మన్మధుడు 2' అంటూ ప్రచారం జరుగుతోంది. 'మన్మధుడు 2'లో ఆల్రెడీ హీరోయిన్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. అయితే గెస్ట్‌ రోల్‌ కోసం సోనాలీతో సంప్రదింపులు చేస్తున్నారనీ సమాచారమ్‌. స్వయంగా మన్మధుడు నాగార్జునే అడిగితే సోనాలీ కాదంటుందా.? నో ఛాన్స్‌. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS