చల్లారు ఈరోజు ఉదయమే ఓ వార్త వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకున్నారని, ఆయనకు తాజా పరీక్షల్లో కరోనా నెగిటీవ్ అని తేలిందని ఆ వార్తల సారాంశం. దాంతో బాలు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.. ఇంతలోనే ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ.. ఆ సంతోషాన్ని ఆవిరి చేస్తూ మరో వార్త బయటకు వచ్చింది. బాలు ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని, ఆయన పరిస్థితి యధాతధంగా ఉందన్నది ఆ వార్త. ఈ వార్త చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా బాలు తనయుడు ఎస్.పి.చరణ్.
బాలు ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ వచ్చారు చరణ్. తాజాగా.. మరో వీడియో విడుదల చేశారు. బాలు ఆరోగ్యంపై పొద్దున్నుంచి వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయన ఆరోగ్యం ఇది వరకటిలానే స్థిరంగా ఉందని, తన తండ్రి ఆరోగ్యం గురించి తనే అప్ డేట్ ఇస్తానని, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. దాంతో బాలు కి కరోనా నెగిటీవ్ అనే వార్త.. రూమరే అని తేలింది. కాకపోతే.. అది నిజమవ్వాలని కోరుకుందాం.
My dad is still on life support, kindly refrain from rumour mongering, says #SPCharan addressing the news of #SPBalasubrahmanyam testing negative for #Covid19 pic.twitter.com/VczMSCg1ar
— Hyderabad Times (@HydTimes) August 24, 2020