ఎన్టీఆర్‌కి స్పెషల్‌ ట్వీటేసిన గుజరాతీ ఫ్యాన్‌.!

మరిన్ని వార్తలు

హైద్రాబాద్‌లో షూటింగ్‌ తర్వాత భారీ షెడ్యూల్‌ కోసం 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ గుజరాత్‌లోని వడోదరకు బయలుదేరింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్‌ సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కి తెలియచేశారు. హైద్రాబాద్‌ నుండి వడోదరకు మూడు ఫ్లైట్‌ టిక్కెట్లను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు ఎన్టీఆర్‌. ఈ ట్వీట్‌కి ఫ్యాన్స్‌ నుండి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అక్కడి నుండి కూడా ఇలాగే అప్‌డేట్స్‌ షేర్‌ చేయమని ఎన్టీఆర్‌ని కోరారు అభిమానులు. 

 

అయితే ఒక అభిమాని మాత్రం గుజరాత్‌లో మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి.. మిమ్మల్ని కలవాలి.. అని ట్వీట్‌ చేశాడు. అంటే ఎన్టీఆర్‌ అభిమానులు గుజరాత్‌లో కూడా ఉన్నారన్న మాట. ఆ అభిమాని ఎగ్జైట్‌మెంట్‌ని ఎన్టీఆర్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటాడో ఏమో.. కానీ ఈ ట్వీట్‌ అయితే నెటిజన్స్‌ని బాగా ఆకర్షించింది. ఇకపోతే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో పాటు, హీరోయిన్లు అలియాభట్‌, డైసీలు కూడా పాల్గొననున్నారనీ సమాచారమ్‌. 

 

భారీ అంచనాల నడుమ సినిమా అనౌన్స్‌ అయ్యాక, ఈ సినిమాపై పోటెత్తిన గాసిప్స్‌ అన్నీ ఇన్నీ కావు. జక్కన్న ఒక్క ప్రెస్‌ మీట్‌తో అనుమానాలన్నీ పటాపంచలు చేసేశాడు. దాంతో ఆ తర్వాత ఒక్క గాసిప్‌ కూడా లేకుండా మొత్తం కామప్‌ అయిపోయింది. ఇక సినిమాకి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్స్‌ని చిత్ర యూనిట్‌ వెలువరిస్తే కానీ సినిమాకి గాసిప్స్‌ గోల లేదనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS