శ్రీరెడ్డికి భలే ఛాన్స్‌ దొరికిందిలే.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌పై విరుచుకుపడడానికి శ్రీరెడ్డికి మరో ఛాన్స్‌ దొరికింది. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌ మీడియాకెక్కి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై శ్రీరెడ్డి సోషల్‌ మీడియాలో స్పందించింది. 

సినీ పరిశ్రమలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగిన శ్రీరెడ్డిపై 'మా' బ్యాన్‌ విధించింది. ఆ సంఘటన అప్పట్లో పెద్ద దుమారానికి కారణమైంది. శివాజీరాజాపై అప్పట్లోనే శ్రీరెడ్డి వివాదాస్పద ఆరోపణలు చేసింది. శ్రీరెడ్డి విషయంలో శివాజీరాజా తీరు అభ్యంతరకరమని నరేష్‌ తాజాగా చెప్పాడు. దాంతో శ్రీరెడ్డికి మళ్లీ ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. కోట్లు ఇచ్చి తన నోరు మూయించాలని శివాజీరాజా అండ్‌ టీమ్‌ ప్రయత్నించిందనీ తాజాగా శ్రీరెడ్డి ఆరోపించింది. 

ఆడపిల్లనైన తన పట్ల నీచంగా ప్రవర్తించారనీ, అందుకు తగిన మూల్యం శివాజీరాజా చెల్లించుకోవల్సి వస్తోందని శ్రీరెడ్డి చెప్పింది. అమెరికాలో ఫండ్స్‌ వసూలు కోసం చేసిన ప్రయత్నాల్లో పెద్ద ఎత్తున సొమ్ములు నొక్కేశారని, పెద్ద హీరోలకు ఈ స్కామ్‌తో సంబంధం ఉందని శ్రీరెడ్డి ఆరోపిస్తోంది. 

అయితే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, శివాజీరాజా, నరేష్‌ మధ్య జరుగుతున్నది కేవలం ఆధిపత్య పోరు మాత్రమేనని కొందరు వ్యక్తులు ఈ వివాదాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్నారని తెలుస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS