'నాగార్జున' ఫార్మ్ హౌస్ లో దొరికిన బాడీ ఎవరిదో తెలుసా?

మరిన్ని వార్తలు

సినీ నటుడు 'నాగార్జున' ఫార్మ్ హౌస్ లో గురువారం ఒక డెడ్ బాడీ లభించిన వార్త సినీ వర్గాల్లో కలకలం రేపింది. 'షాద్ నగర్' సమీపంలోని 'పాపిరెడ్డిగూడ' లో సుమారు 40 ఎకరాల భూమి కొనుగోలు చేసిన నాగార్జున చాలా కాలం తరువాత అక్కడ 'ఆర్గానిక్ వ్యవసాయం' మొదలుపెడదామనే ఉద్దేశ్యం తో తన మనుషులను అక్కడికి పంపగా, అక్కడ ఒక గుర్తు తెలియని మృత దేహానికి సంబంధించిన అస్థిపంజరం బయట పడింది.

 

దీనిపై 'శంషాబాద్' డిసిపి 'ప్రకాష్ రెడ్డి' విచారణ జరిపి ఘటనా స్థలం లో లభించిన పర్స్ లోని 'ఫోటో' మరియు 'ఆధార్ కార్డు' ఆధారంగా ఆ బాడీ 'చలాకి పండు' అనే వ్యక్తిదిగా గుర్తించారు. సైబరాబాద్ కమిష్నరేట్ అండర్ లోని 'కాశెమ్ పెట్' పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు. 'పండు' కుటుంబ సభ్యులతో విచారణ జరపగా 'పండు' 3 ఏళ్ల క్రితమే ఇల్లు వదిలి వెళ్లినట్టు, ఒక సూసైడ్ లెటర్ కూడా వదిలి వెళ్లినట్టు తెలిసింది.

 

కిడ్నీ సమస్య వల్ల తన అన్నయ్య మరణించిడం తనను కలచి వేసిందని..తనకు పెళ్లి చేసుకోవాలనీ, బ్రతకాలనీ కూడా లేదని తన చావుకి ఎవరూ కారణం కాదని...ఆస్తిలో తనకు రావాల్సిన వాటా 19 లక్షలు తన తల్లికి దక్కాలని.." ఆ లేఖ లో రాసుకున్నాడు. అయితే, ఫోరెన్సిక్ రిపోర్ట్ అందిన తరువాత ఫిర్యాదు నమోదు చేస్తామని పండు కుటుంబ సభ్యులు వెల్లడించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS