తాప్సీ ఇక్కడ వేరు అక్కడ వేరు.!

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో ఉన్నప్పుడు అందాల భామ తాప్సీకి, బాలీవుడ్‌కెళ్లాక తాప్సీకి అస్సలు పొంతనే లేదు. సౌత్‌లో కేవలం గ్లామరస్‌ పాత్రలకే పరిమితమైన తాప్సీ, బాలీవుడ్‌కెళ్లాక తనను తాను పూర్తిగా మార్చేసుకుంది. ఏ సినిమాకైనా 100 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టేస్తోంది. 'నామ్‌ షబానా' కోసం తాప్సీ తనను తాను ఎంత కష్టపెట్టుకుందో అందరికీ తెలిసిందే. తెరపై తాప్సీ పడిన కష్టం అంతా కనిపించింది. అలాగే తాజాగా తాప్సీ హీరోయిన్‌గా 'సూర్మా' సినిమా తెరకెక్కుతోంది. 

ప్రముఖ హాలీవుడ్‌ ప్లేయర్‌ సందీప్‌ సింగ్‌ బయోపిక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఓ యాక్సిడెంట్‌ కారణంగా ఆయన తన రెండు కాళ్లూ పోగొట్టుకుంటాడు. హాకీ ఆటకే కాదు, కనీసం నిలబడలేని పరిస్థితికి చేరుకుంటాడు. అలాంటి ఆయనను తిరిగి మామూలు మనిషిగా మార్చే ప్రయత్నంలో తాప్సీ కనబరిచే నటన అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుందట. 

చాలా హృద్యంగా తెరకెక్కించారీ సినిమాని షాద్‌ ఆలీ. సందీప్‌ సింగ్‌ పాత్రలో దిల్జిత్‌ దోసాంజీ నటిస్తున్నారు. నేచురాలిటీ కోసం తాప్సీ ఎంతో కష్టపడి హాకీ నేర్చుకుందట. ఈ నెల 13న 'సూర్మా' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాదు, బాలీవుడ్‌లో ఇలాంటి ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్రలు చేస్తూనే అప్పుడప్పుడూ తెలుగులోనూ నటిస్తోంది. 

బాలీవుడ్‌కెళ్లిన తర్వాత తెలుగులో 'ఆనందోబ్రహ్మ' సినిమాలో నటించిన తాప్సీ, ఇప్పుడు 'నీవెవరో' చిత్రంలో నటిస్తోంది. ఆది పినిశెట్టి హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS