బుల్లితెరపై ‘నీకు మాత్రమే’ చెప్తానంటున్న తరుణ్‌

మరిన్ని వార్తలు

దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌, నటుడయ్యాడు. ఇప్పుడు బుల్లితెరపై వ్యాఖ్యాత కాబోతున్నాడు. ‘పెళ్ళి చూపులు’ సినిమాతో దర్శకుడిగా అందరి మన్ననలూ అందుకున్న తరుణ్‌ భాస్కర్‌, హీరోగా ‘మీకు మాత్రమే చెబుతా’ సినిమాతో మంచి మార్కులేయించుకునేందుకు తనవంతుగా బాగానే ప్రయత్నించినా, ఆ సినిమా పరాజయంతో డీలాపడిన విషయం విదితమే. ఇప్పుడు ‘నీకు మాత్రమే చెబుతా’ చెబుతా అనే టాక్‌ షోతో బుల్లితెర వీక్షకుల్ని పలకరిస్తానంటున్నాడు. టాక్‌ షో అనగానే తెలుగు బుల్లితెరపై చాలామంది తారలు గుర్తుకొస్తారు.. అలా ఎన్నో షోల్ని తారలు హోస్ట్‌ చేశారు కూడా. మరి, తరుణ్‌ భాస్కర్‌ టాక్‌ షో ఎలా వుండబోతోంది.? అంటే, ఇది కాస్త భిన్నంగా వుంటుందని అంటున్నాడు ఈ యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కవ్‌ు నటుడు కవ్‌ు బుల్లితెర వ్యాఖ్యాత.

 

ఓ ప్రముఖ ఛానల్‌లో ఈ టాక్‌ షో ప్రసారం కాబోతోంది. ఒకప్పుడు బుల్లితెర అంటే చాలామందికి చులకన. కానీ, ఇప్పుడు ఆ బుల్లితెర ఓ సంచలనంగా మారిపోయింది. స్టార్‌ హీరోలు సైతం బుల్లితెరపై తమదైన స్టయిల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, అక్కినేని నాగార్జున, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, విలక్షణ నటుడు రాణా.. ఇలా ఒకరేమిటి.? చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు.. సక్సెస్‌లు కొట్టారు కూడా. బుల్లితెరకు పెరిగిన డిమాండ్‌ అలాంటిది మరి. ఈ కోవలో టాక్‌ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌, తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడా? వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS