మొన్న అనసూయ ఇప్పుడు రష్మి.!

మరిన్ని వార్తలు

టీవీ యాంకర్‌ కమ్‌ హీరోయిన్‌ రష్మి ఓ వివాదంలో చిక్కుకుంది. రష్మి కారు ఢీకొట్టడంతో ఓ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. విశాఖ జిల్లా గాజువాక కూర్మన్న పాలెం దగ్గర రోడ్డు క్రాస్‌ చేస్తుండగా ఓ యువకుడు రష్మి కారును ఢీకొట్టి తీవ్ర గాయాలపాలయ్యాడు. యాక్సిడెంట్‌ అనంతరం హుటాహుటిన దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందిన యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో విశాఖ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. 

 

విశాఖలో ఓ ఓపెనింగ్‌ కార్యక్రమానికి హాజరైన రష్మికి దారిలో ఈ వింత అనుభవం ఎదురైంది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఈ యువకుడి పరిస్థితి విషమంగానే ఉందనీ సమాచారమ్‌ అందుతోంది. గతంలో అనసూయ కూడా ఇలాంటి గొడవలోనే ఇరుక్కుంది. 

 

సెల్ఫీ కోసం ట్రై చేసిన ఓ కుర్రాడిపై అనసూయ అనవసరంగా చేయి చేసుకున్నదనీ, అనసూయను అభిమానులు తప్పు పట్టారు. ఎలాగోలా ఆ వివాదం నుండి బయటపడింది అనసూయ. ఇప్పుడు రష్మి రేష్‌ డ్రైవ్‌ ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందంటూ సోషల్‌ మీడియాలో ఓ వర్గం అభిమానులు రష్మిని గుమ్మెత్తి పోస్తున్నారు. ఈ మధ్యనే కొత్త కారు తీసుకున్న రష్మికి, కొత్త కారులో షికారు ఇంత పెద్ద తంటా తెచ్చి పెట్టింది పాపం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS