తేజు - వరుణ్‌ మల్టీ స్టారర్‌ అట.!

మరిన్ని వార్తలు

ఒకప్పుడు మల్టీ స్టారర్‌ మూవీస్‌ అంటే చాలా అరుదుగా తెరకెక్కేవి. బాలీవుడ్‌లో మాత్రమే మల్టీ స్టారర్‌ మూవీస్‌ ఎక్కువగా వచ్చేవి. తెలుగులో మల్టీ స్టారర్స్‌ అంటే చాలా చాలా తక్కువ. కానీ, ట్రెండ్‌ మారింది. హీరోల ఆలోచనలు మారాయి. దాంతో మల్టీ స్టారర్‌ మూవీస్‌కి మన హీరోలూ ఎక్కువగానే సై అంటున్నారు. వెంకీ - పవన్‌, వెంకీ - మహేష్‌, వెంకీ - వరుణ్‌, నాగ్‌ - నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే, మన టాలీవుడ్‌ మల్టీ స్టారర్‌ లిస్టు కూడా చాలా పెద్దగానే తయారైంది. అఫ్‌కోర్స్‌ వీటిన్నంట్లో ఎక్కువగా వెంకీ పేరే రిపీట్‌ అయ్యిందనుకోండి.

 

లేటెస్ట్‌గా రియల్‌ లైఫ్‌ మేనల్లుడు చైతూతోనూ వెంకీ ఓ మల్టీ స్టారర్‌ చేసి, హిట్‌ కొట్టేశాడు. ఇకపోతే, త్వరలోనే ఎన్టీఆర్‌ - చరణ్‌ మల్టీ స్టారర్‌ ధియేటర్స్‌లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా కాంపౌండ్‌ నుండి కూడా మల్టీ స్టారర్‌కి ఈ జనరేషన్‌ హీరోలు సిద్ధంగా ఉన్నారట. వారెవరో కాదు, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌. వీరిద్దరూ ఎప్పుడు మాట్లాడుకున్నా మల్టీ స్టారర్‌ గురించే మాట్లాడుకుంటారట. మనమిద్దం కలిసి ఓ మల్టీ స్టారర్‌లో నటించాలని చర్చించుకుంటారట. అయితే, ఆ రేంజ్‌లో కథ సిద్ధం కావాలి కదా. ఇప్పుడే కదా.. తేజు తన మనసులోని మాట బయట పెట్టాడు.

 

ఇక మన రచయితలు ఆ పనిలో ఉంటార్లెండి. ఈ బావ బావమరుదుల కోసం ఓ అదిరిపోయే మల్టీ స్టారర్‌కి రంగం సిద్ధం చేసేస్తారులే. ఈ మల్టీ స్టారర్‌ని నిర్మించేందుకు రామ్‌ చరణ్‌ తన సొంత బ్యానర్‌ ఎలాగూ ముస్తాబుగానే ఉంటుంది. త్వరలోనే మెగా హీరోల మల్టీ స్టారర్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చన్న మాట మెగా అభిమానులు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS