'కూచిపూడి వారి వీధి'లో విశ్వనటుడితో వెంకీ.!

మరిన్ని వార్తలు

2009లో కమల్‌హాసన్‌, విక్టరీ వెంకటేష్‌ కాంబినేషన్‌లో 'ఈనాడు' చిత్రం తెరకెక్కింది. టి.చక్రి చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మళ్లీ వెంకీ, కమల్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్‌ మూవీకి శ్రీకాంత్‌ ఆడ్డాల దర్శకత్వం వహించనున్నారనీ సమాచారమ్‌. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ ఈ భారీ మల్టీస్టారర్‌కి రంగం సిద్ధం చేస్తోందనీ ఫిల్మ్‌ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

 

'కొత్త బంగారు లోకం'తో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత వెంకీ, మహేష్‌తో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మూడో సినిమా 'బ్రహ్మూెత్సవం' దారుణంగా నిరాశపరచడంతో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు శ్రీకాంత్‌ అడ్డాల. మంచి విషయం ఉన్న దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల. ఓ విభిన్న కథాంశాన్ని వెంకీ, కమల్‌ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

 

ఈ సినిమాకి 'కూచిపూడి వారి వీధి' అనే డిఫరెంట్‌ ట్రెడిషనల్‌ టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. డైరెక్టర్‌ రెడీ, బ్యానర్‌ రెడీ, హీరోలు రెడీ, టైటిల్‌ కూడా రెడీ. ఇక అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రావడమే ఆలస్యం. వెంకీ తాజాగా 'ఎఫ్‌ 2తో సంక్రాంతికి సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టాడు. తదుపరి మేనల్లుడు చైతూతో 'వెంకీ మామ' సినిమాలో నటించనున్నాడు. మరోవైపు కమల్‌ 'భారతీయుడు 2'తో బిజీగా ఉన్నాడు. మరి ఈ బిగ్‌ మల్టీస్టారర్‌ ఎప్పుడు పట్టాలెక్కనుందో త్వరలోనే ఓ క్లారిటీ రానుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS