రజినీ, అజిత్ ఫాన్స్ మధ్య కత్తులతో దాడి.. నలుగురి పరిస్థితి విషమం

మరిన్ని వార్తలు

సంక్రాంతి పండుగ సందర్భంగా కోలీవుడ్ లో ఒకేసారి రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'పెట్ట', రెండవది థల అజిత్ నటించిన 'విశ్వాసం'. ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు విడుదల కావడంతో అభిమానుల మధ్య భారీ ఫైట్ నెలకొంది. రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో ఫాన్స్ ఆనందం మిన్నంటుతుంది. ఆ ఆనందం కాస్త హద్దులు దాటి ఘర్షణగా మారింది.

 

వేలూరులోని ఓ థియేటర్ వద్ద ఇరు వర్గాల అభిమానులు మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అంటూ గొడవకి దిగారు. కామెంట్లతో మొదలయిన ఈ ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాటల తీవ్రత పెరిగి ఇరువర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ క్రమంలో కొందరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఆ కత్తులాటలో నలుగులు అభిమానులు తీవ్రంగా గాయపడి, వారి పరిస్థితి విషమయంగా ఉందని సమాచారం.

 

మరోవైపు, మధురైలో కూడా అభిమానులు ఇలాగే గొడవలకు పాల్పడ్డారు. చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్ లో కూడా అజిత్ 'విశ్వాసం' కన్నా, రజినీ 'పెట్ట' షో ముందు వేయడంతో ఫాన్స్ అలజడులు సృష్టించారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి అభిమానం పేరుతో అలజడులు పుట్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి థియేటర్ దగ్గర పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS