ఆమెకి 'పైసావసూల్‌' అయ్యనా?

మరిన్ని వార్తలు

'పైసావసూల్‌' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్‌లో 'పూరి కనెక్ట్స్‌' తరఫున ఛార్మినే ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా నిర్మాణ పర్యవేక్షణ అంతా పూర్తిగా ఛార్మి కనుసన్నల్లోనే జరుగుతోంది. బాలకృష్ణతో గతంలో ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించిన చార్మి, 'పైసావసూల్‌'తో కొత్త పాత్రలోకి ఒదిగిపోయింది. చాలాకాలంగా సినిమా నిర్మాణంపై దృష్టిపెట్టిన ఛార్మి, సినిమాకి సంబంధించి వివిధ విభాగాల పనితీరుని మరింత జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిర్మాతగా మారాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలియవస్తోంది. 'పైసావసూల్‌' తర్వాత ఛార్మి పూర్తిస్థాయి నిర్మాతగా మారుతుందని సమాచారమ్‌. పూరి జగన్నాథ్‌ - ఛార్మి సంయుక్తంగా ఇకపై సినిమాలు నిర్మిస్తారట. పెద్ద సినిమాల్ని ఇంకో నిర్మాత భాగస్వామ్యంతో, చిన్న సినిమాల్ని పూరి కనెక్ట్స్‌ మీద నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారమ్‌. 'పైసావసూల్‌' సినిమా ఫలితం తర్వాత ఈ అంశాలపై క్లారిటీ ఇస్తూ పూరి జగన్నాథ్‌, ఛార్మి ఓ ప్రకటన చేయున్నారని సినీ వర్గాల్లో టాక్‌ వినవస్తోంది. అయితే ఇంతవరకు ఈ విషయంపై పూరి, ఛార్మి ఎలాంటి సంకేతాలు పంపలేదు. అయితే పూరి కనెక్ట్స్‌ ద్వారా నటీనటుల్ని 'ఇంపోర్ట్‌' చేయడం వంటి కార్యకలాపాలే ఇప్పటిదాకా చేపట్టారు. 'పైసావసూల్‌' పోస్టర్లలో 'పిసి' (పూరి కనెక్ట్స్‌) చాంతాడంత అక్షరాలతో కనిపిస్తుండడం గమనించదగ్గ విషయంగా చెప్పుకోవాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS