జ్యోతిక బాధ అర్ధం చేసుకోరూ!

మరిన్ని వార్తలు

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ప్రస్తుతం ప్రాధాన్యత బాగా ఉంది. అలాగే స్టోరీ, కాన్సెప్ట్‌ నచ్చితే ప్రేక్షుల నుండి ఆదరణ కూడా బాగా లభిస్తోంది ఇటువంటి సినిమాలకి. తాజాగా జ్యోతిక, భానుప్రియ, ఊర్వశి, శరణ్య పొన్వన్నన్‌ ప్రధాన పాత్రల్లో తమిళంలో సినిమా తెరకెక్కుతోంది. 'మగలిర్‌ మట్టుం' (ఆడవాళ్లకు మాత్రమే) అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ని బ్రహ్మ తెరకెక్కిస్తున్నారు. జ్యోతిక భర్త హీరో సూర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో జ్యోతిక డాక్యుమెంటరీ ఫిలిం మేకర్‌ పాత్రలో నటిస్తోంది. పెళ్లి తర్వాత జ్యోతిక సెలెక్ట్‌డ్‌గా మూవీస్‌ని చేస్తోంది. వాటిలో ఎక్కువ హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీసే. ఆ కోవలోకి చెందిన సినిమా అయినా ఈ సినిమా సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్ర యూనిట్‌. పెళ్లి తర్వాత ఓ కోడలు తన అత్తయ్యను, స్నేహితులను రోడ్‌ ట్రిప్‌నకు తీసుకెళ్లడమే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో నటించడం తమకెంతో సంతోషంగా ఉందనీ కో ఆర్టిస్ట్‌లతో కలిసి జ్యోతిక తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇలాంటి కథల్ని ఇంతవరకూ ఎవ్వరూ తెరకెక్కించలేదు. కాన్సెప్ట్‌ చాలా ఈజీగా ప్రేక్షకులకి రీచ్‌ అవుతందనీ ఆమె అన్నారు. అయితే పురుషాధిక్య పరిశ్రమ సినీ పరిశ్రమ. ఈ పరిశ్రమలో ఇలాంటి హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌ బాక్సాఫీస్‌ వద్ద నిలబడి వసూళ్లు రాబట్టడం అంటే సవాల్‌తో కూడిన విషయం అని జ్యోతిక అన్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS