'శివ' కాంబినేషన్‌ సెట్స్‌ మీదికెళ్లేది అప్పుడే

మరిన్ని వార్తలు

సెన్సేషనల్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కాబోతోంది. అదే నాగార్జున - రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌. మొదట్లో ఈ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా అంటే ఆది 'శివ'కి సీక్వెల్‌ అనుకున్నారు. కానీ ఇది 'శివ' సీక్వెల్‌ కాదని నాగార్జున తేల్చేశారు. ఇదో డిఫరెంట్‌ యాక్షన్‌ మూవీ అట. చాలా స్టైలిష్‌గా నాగార్జున కనిపిస్తారట. ఈ స్టోరీ వినగానే నాగార్జున మైండ్‌ బ్లోయింగ్‌ అన్నారట. అంత బాగా ఈ స్టోరీ నాగ్‌కి నచ్చేయడంతో వెంటనే ఈ కాంబినేషన్‌ ఓకే అయిపోయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుందట. అయితే ప్రస్తుతం నాగార్జున ఓ పది రోజులు హాలీడే వెకేషన్‌ ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారట. ఆ వెకేషన్‌ నుండి తిరిగి వచ్చిన వెంటనే వర్మతో సినిమా పట్టాలెక్కుతుందనీ నాగ్‌ అన్నారు. ఇటీవలే 'రాజుగారి గది - 2' సినిమాతో మంచి విజయం దక్కించుకున్న నాగార్జున, తర్వాతి మూవీ ఓ యాక్షన్‌ మూవీ కావడం నాగ్‌ ఫ్యాన్స్‌ ఆనందించదగ్గ విషయమే. ఇంతవరకూ ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరగా ఉండే కాన్సెప్ట్‌తో కూల్‌ మూవీస్‌ని ఎంచుకున్నారు నాగ్‌. ఇప్పుడు ఈ యాక్షన్‌ మూవీ కోసం, కొన్ని రోజులు రీఫ్రెష్‌ అయ్యి రావాలనుకుంటున్నారట. మరో పక్క నాగార్జున, యంగ్‌ స్టార్‌ నానితో ఓ మల్టీ స్టారర్‌కి సైన్‌ చేశారు. ఇదిలా ఉండగా, వర్మ ప్రస్తుతం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే నాగార్జునతో యాక్షన్‌ మూవీ కంప్లీట్‌ అయ్యాకే 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ని సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నారట వర్మ. ఎందుకంటే ఆ సినిమా పట్టాలెక్కేందుకు ఇంకా చాలా టైమే ఉంది. ఫిబ్రవరిలో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ లోగా నాగ్‌తో సినిమా కంప్లీట్‌ చేసి రిలీజ్‌ చేసేస్తారు కాబోలు వర్మ.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS