'డిజె' బ్యూటీ అలా భయం పోగొట్టుకుంటుందట

మరిన్ని వార్తలు

ప్రస్తుతం టాలీవుడ్‌ అంతా మార్మోగిపోతున్న పేరు పూజా హెగ్దే. ఈ ముద్దుగుమ్మకి స్టార్టింగ్‌ నుండీ క్రేజే. 'ముకుందా' సినిమాతో టాలీవుడ్‌ని పలకరించింది. తర్వాత నాగచైతన్యతో 'ఒక లైలా కోసం' సినిమాలో నటించి బాలీవుడ్‌కి చెక్కేసింది. తిరిగొచ్చినాక స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ సినిమా ఆమె కోసమే అన్నట్లుగా రెడీగా ఉంది. ఇంకేం బిగ్‌ ప్రాజెక్ట్‌. అమ్మడి ఆనందానికి అదుపే లేదు. వ్యక్తిగతంగా పూజా హెగ్దే అంటే డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అని అందరికీ తెలుసు. అయితే ఈ బ్యూటీకి కూడా కొన్ని భయాలున్నాయట. ఆ భయాల్ని పోగొట్టుకోవడానికి స్కై డైవింగ్‌ చెయ్యాలని నిర్ణయించుకుందట. త్వరలో అబుదాబీకి వెళ్ళి స్కై డైవింగ్‌ చేస్తానంటోంది. అదొక సాహసోపేతమైన క్రీడగా చెప్పుకోవచ్చు. 'డిజె'తో తెలుగు ప్రేక్షకుల్ని ఈ మధ్యనే అలరించింది. మంచి విజయాన్ని కూడా అందుకుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా, శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. మరికొన్ని ఛాన్స్‌లు కూడా ఈ బ్యూటీని పలకరించబోతున్నాయి. లేటెస్ట్‌గా ఓ మెగా ప్రాజెక్ట్‌ ఈ బ్యూటీ ఖాతాలో చేరిందనే టాక్‌ వినవస్తోంది. క్యూట్‌ అండ్‌ హాట్‌గా 'డిజె'లో తన గ్లామర్‌ని ఒలకబోసేయడంతో టాలీవుడ్‌లో ఇప్పుడు హాటెస్ట్‌ బ్యూటీ ఎవరంటే పూజా హెగ్దే పేరే చెబుతున్నారంతా. ఏది ఏమైనా ఈ హాట్‌ బ్యూటీ టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయిపోయింది. దాంతో ఇకపై వరుస అవకాశాలతో అమ్మడికి తిరుగే లేదంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS