రెండో విక్రమార్కుడు - అక్కడా? ఇక్కడా?

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన 'విక్రమార్కుడు' సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అందుకే 'విక్రమార్కుడు' సీక్వెల్‌కి సంబంధించి అక్షయ్‌కుమార్‌, రచయిత విజయేంద్రప్రసాద్‌పై ఒత్తిడి పెంచుతున్నాడట. తెలుగులో 'విక్రమార్కుడు' సినిమా రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో ఘనవిజయం సాధించింది. రవితేజకు కెరీర్‌ బెస్ట్‌ మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్నే హిందీలోకి 'విక్రమ్‌ రాథోడ్‌' పేరుతో అక్షయ్‌కుమార్‌ రీమేక్‌ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అందుకే దానికి సీక్వెల్‌ చేయాలని ఎప్పటినుంచో అక్షయ్‌కుమార్‌ అనుకుంటున్నాడు. కానీ రీమేక్‌కి కథ కుదరలేదు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్‌పై ఒత్తిడి పెంచాడట అక్షయ్‌కుమార్‌. దాంతో విజయేంద్రప్రసాద్‌ కూడా సీక్వెల్‌ రాయాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారమ్‌. 'బాహుబలి' తర్వాత ఏ పెద్ద సినిమా రూపొందినా అది ఇండియన్‌ సినిమాగా ఉండాలనే ఆలోచనలొస్తున్నాయి. అక్షయ్‌కుమార్‌ కూడా 'విక్రమ్‌ రాథోడ్‌' సీక్వెల్‌ని పెద్ద స్థాయిలో నిర్మించాలని అనుకుంటున్నాడట. ఇంకో వైపున 'విక్రమార్కుడు' సీక్వెల్‌ కోసం రవితేజ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాకి సీక్వెల్‌ తెలుగులోనా? హిందీలోనా? అనేది తెలియ రావడం లేదు. ఏదేమనా ఎక్కడొచ్చినా విజయేంద్ర ప్రసాద్‌ కథతో ఎక్కడైనా సెన్సేషన్‌ కావడం పక్కా. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS