కౌషల్‌ని కడిగి పారేసిన పృధ్వీ.!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ 2 విజేతగా సెన్సేషనల్‌ విజయం అందుకున్న కౌషల్‌ ఇప్పుడు వివాదాల్లోకెక్కాడు. కౌషల్‌ గెలుపుకు కారణమైన కౌషల్‌ ఆర్మీనే ఇప్పుడు ఆయనకు రివర్స్‌ అయ్యింది. బిగ్‌బాస్‌ నుండి బయటికొచ్చిన తర్వాత కౌషల్‌ ఆర్మీ సహకారంతో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించాడు కౌషల్‌. అయితే ఆ కౌషల్‌ ఆర్మీ తప్పుదోవ పట్టింది. కౌషల్‌ పేరు చెప్పి, కౌషల్‌ ఆర్మీలో సేవాకార్యక్రమాల మాటున పలు రకాల ఆసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గ్రహించిన కౌషల్‌ అందుకు కారణమైన వారిని కొందర్ని కౌషల్‌ ఆర్మీ సభ్యత్వం నుండి తొలగించారు. 

 

ఇదిలా ఉంటే, ఈ ఇష్యూని హైలైట్‌ చేస్తూ పలు ఛానెల్స్‌ డిబేట్స్‌, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ నటుడు ఫైర్‌ బ్రాండ్‌ పృధ్వీని ఇంటర్వ్యూ చేయగా, 'కౌషల్‌ ఆర్మీ' అంతా ఫేక్‌ అని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ అనే మాట ఉపయోగించొద్దని ఆయన మండిపడ్డారు. కౌషల్‌ ఆర్మీ పేరిట చేసిన సేవాకార్యక్రమాలు కూడా ఫేక్‌ అనీ, అదంతా పబ్లిసిటీ స్టంట్‌ కోసం చేసినదేననీ ఆయన పేర్కొన్నారు. 

 

అంతేకాదు, ఇటీవల తనపై వస్తున్న వదంతుల్ని మీడియా ముఖంగా పరిష్కరించుకునేందుకు సతీ సమేతంగా మీడియా ముందుకొచ్చిన కౌషల్‌ ఒకానొక సందర్భంలో కంట తడి పెట్టుకోవడం జరిగింది. ఆ విషయమై స్పందించిన పృధ్వీ అదో రకం ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ అని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. వాస్తవానికి బిగ్‌బాస్‌ 2లో జన్యూన్‌గా అడింది తనీష్‌ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం నటుడిగానే కాకుండా పృధ్వీ వైఎస్సార్‌సీపీ తరపున రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS