టీడీపీ తరపున ప్రచార బరిలో యంగ్‌ హీరో నిఖిల్‌.!

మరిన్ని వార్తలు

ఫ్యామిలీ వేరు. రాజకీయం వేరు. అభిమానం వేరు. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమాని యంగ్‌ హీరో నిఖిల్‌. అది అభిమానం. టీడీపీ తరపున నిఖిల్‌ ప్రచారంలో పాల్గొన్నాడు. ఇది రాజకీయం. టీడీపీ నేత కె.ఇ. ప్రతాప్‌ తరపున యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్థ్ ప్రచారం చేశారు. ఇది ఫ్యామిలీ. కె.ఇ.ప్రతాప్‌, నిఖిల్‌కి అంకుల్‌ కావడం వల్ల ఆయన తరపున కర్నూల్‌లో నిఖిల్‌ ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. పవన్‌ కళ్యాన్‌కి వీరాభిమాని అయిన నువ్వు చేస్తున్నదేంటీ.? అంటూ సోషల్‌ మీడియాలో పవన్‌ ఫ్యాన్స్‌ నిఖిల్‌ని ట్రాల్‌ చేస్తున్నారు. 

 

అందుకు నిఖిల్‌ 'నేనెప్పుడూ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి అభిమానినే.. ఓ అభిమానిగా ఆయన ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాను.. 'గబ్బర్‌సింగ్‌' సినిమా టైంలో ఆయన తన సినిమాని పక్కన పెట్టి నా సినిమాకి హెల్ప్‌ చేశారు. అది నేనెప్పటికీ మర్చిపోను.. అంటూ పవన్‌తో దిగిన ఫోటోలు పోస్ట్‌ చేసి, ప్రస్తుతం రాజకీయాల్లో మీకు ప్రతికూలంగా జరుగుతున్న పరిస్థితులు, మీకు మరింత బలాన్ని చేకూర్చేలా పరిణమించాలి.. మీరు ఏదైతే కోరుకుంటున్నారో. 

 

అది మీరు తప్పకుండా సాధించాలి. మీ అభిమానులుగా మిమ్మల్ని ఎప్పుడూ మేం ప్రేమిస్తూనే ఉంటాం..' అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. టీడీపీ తరపున ప్రచారం చేస్తున్నందుకు నిఖిల్‌ని మొదట్లో పవన్‌ ఫ్యాన్స్‌ ఆడిపోసుకున్నా, నిఖిల్‌ చెప్పిన వివరణకు కన్విన్స్‌ అయ్యారు. ప్రస్తుతం నిఖిల్‌ 'అర్జున్‌ సురవరం' సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS