ఈ సమ్మర్ లోనే 'కెజిఎఫ్' బంగారు చేప రాబోతుంది

మరిన్ని వార్తలు

ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న చిత్రం 'కెజిఎఫ్'. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ యంగ్ హీరో యష్ హీరోగా నటించాడు. ట్రైలర్ తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, విడుదల తర్వాత ఊహించని విధంగా విజయం సాధించి, మంచి వసూళ్ళని కూడా రాబడుతుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ ముందుగానే తెలియచేసారు. రెండు భాగాల షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసినట్లు సమాచారం. హీరో యాష్ కూడా తన కొత్త సినిమా కోసం మాస్ రాఖీ లుక్ (గడ్డం లుక్) ని ఇటివలే మార్చడం జరిగింది.



'కెజిఎఫ్' చాప్టర్ 1 కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ మరియు తమిళ భాషల్లో విడుదల అయి మంచి విజయం సాధించడంతో, ఇప్పుడు అందరి కళ్ళు 'కెజిఎఫ్ చాప్టర్ - 2' మీద పడ్డాయి. దీంతో మిగిలిన నిర్మాణ పనులను పూర్తి చేసి ఈ సమ్మర్లో చాప్టర్ - 2 ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా, ఈ చిత్రం పై అంచనాలు కూడా ఎక్కువగా ఉండటంతో సోలో రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చాప్టర్ 1 ఏకంగా నాలుగు సినిమాలతో పోటీపడి నెగ్గుకు రావడం కూడా విశేషం.



ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి అసలైన కథ కెజిఎఫ్-2 లోనే ఉంటుందని  తెలియజేసింది. రాఖీ భాయ్ గరుడను చంపి ఆ గనులన్ని సొంతం చేసుకుని ఏం చేస్తాడు, దానిపైనే కన్నేసిన ఇతర ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటాడు వంటి మరికొన్నిఆశక్తి కరమైన అంశాలతో ఈ చిత్రం సిద్దం కాబోతుంది. మరి 'కెజిఎఫ్' చాప్టర్-2 ఎలా ఉంటుందో చూడాలంటే ఈ ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS