మహర్షి': 'సింగిల్‌'గా అంచనాలు పెంచేశాడు.!

మరిన్ని వార్తలు

ఫ్యాన్స్‌కి ఉగాది, దసరా తదితర పండగలన్నీ ముందే వచ్చేసినట్లనిపిస్తోంది. ఎందుకంటారా.? లేట్‌ చేశారు. కానీ లేటెస్ట్‌గా వచ్చేశారు. అవునండీ మహేష్‌బాబు గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకూ సింగిల్‌ టీజర్‌తోనే అంచనాలు క్రియేట్‌ చేసిన మహేష్‌బాబు 'మహర్షి' వరుస పోస్టర్లతో పిచ్చెక్కించేస్తున్నారు. మహేష్‌, నరేష్‌, పూజాహెగ్దే ముగ్గురి మధ్యా ఫ్రెండ్‌షిప్‌ని ఓ రేంజ్‌లో జనం మధ్యకి తీసుకొచ్చేశారు గత రెండు రోజులుగా. 

 

తాజాగా విడుదలైన పోస్టర్స్‌ అయితే కెవ్వు కేక పుట్టించేస్తున్నాయి. 'చోటీ చోటీ బాతే..' అనే ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ చేసి సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశారు. ట్రయాంగిల్‌ ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ దేవిశ్రీ ప్రసాద్‌ గళం, ఆహ్లాదంగా ఉండడంతో అందరికీ బాగా కనెక్ట్‌ అవుతోందీ సాంగ్‌. ఈ సాంగ్‌ ఆడియోకి వస్తున్న రెస్పాన్సే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక వీడియో విషయానికొస్తే, వంశీ పైడిపల్లిని తక్కువగా అంచనా వేయలేం. 

 

ఫీల్‌ని ఆడియన్స్‌కి కనెక్ట్‌ చేయడంలో వంశీ పైడిపల్లి ఆయనకు ఆయనే సాటి. పోస్టర్స్‌లో ముగ్గురు స్నేహితులు.. వారి మధ్య అమితమైన స్నేహం.. ఇంకేముంది.. ఊహించుకోవడం కష్టమే. గతంలో ఈ తరహా స్టోరీలు చాలానే వచ్చాయి. అయితే వాటిన్నింట్లోనూ 'మహర్షి' డిఫరెంట్‌గా ఆకట్టుకోనుందనిపిస్తోంది. హిట్‌ పక్కా అని ఫిక్సయిపోయారు ఫ్యాన్స్‌. మే 9న 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS