మహర్షి తరవాత.. రామ్ చరణ్ తోనే..?

మరిన్ని వార్తలు

మహర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు వంశీ పైడిపల్లి. ఈ సినిమాపై మంచి బజ్ నడుస్తోంది. ఇప్పటికే రెండు పాటలు ఊపేస్తున్నాయి. టీజర్ తో అంచనాలు మరింతగా పెరిగాయి. మహర్షి అనుకున్న స్థాయిలో ఆడితే, దర్శకుడిగా వంశీ తన రేంజు మరింతగా పెంచుకున్నట్టే. అందుకే ఇప్పటి నుంచే కర్చీఫ్ లు పరిచేస్తున్నారు స్టార్ హీరోలు. వంశీతో సినిమాలు చేయడానికి ప్రపోజల్స్ తీసుకొస్తున్నారు. ఈ జాబితాలో రామ్ చరణ్ కూడా ఉన్నాడని టాలీవుడ్ టాక్.

 

రామ్ చరణ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో 'ఎవడు' సినిమా వచ్చింది. బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్నే రాబట్టింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబో లో ఓ సినిమా ఉండొచ్చని టాలీవుడ్ టాక్. మహర్షి తరవాత.. వంశీ చేయబోయే సినిమా ఇదే అని కూడా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నాడు చరణ్. 2020 ఫిబ్రవరి నాటికి చరణ్ ఫ్రీ అయిపోతాడు. ఆ తరవాతే.. వంశీ తో సినిమా పట్టాలెక్కవచ్చు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS