రకుల్‌ కోరిక మన్మధుడే తీర్చాలి.!

మరిన్ని వార్తలు

వరుస సినిమాలతో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి తెలుగులో ఇప్పుడు సీనే లేకుండా పోయింది. అయితే కింగ్‌ నాగార్జున రకుల్‌కి పిలిచి మరీ అవకాశమిచ్చాడు. అది కూడా తన పక్కన హీరోయిన్‌గా. అదే 'మన్మధుడు 2'. ఈ సినిమా విజయం రకుల్‌కి ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సీక్వెల్స్‌ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. మొదటి పార్ట్‌ సాధించిన ఘన విజయం, సీక్వెల్స్‌ విషయంలో తికమక అయిన సందర్భాలు అనేకం. 

 

అయితే 'బాహుబలి'తో ఈ అనుమానాలు పటాపంచలైపోయినా, ఎందుకో మిగిలిన సినిమాలకు మాత్రం సీక్వెల్స్‌ పెద్దగా అచ్చొచ్చిన సందర్భాల్లేవు. అంతెందుకు కొత్త వాళ్లతో తెరకెక్కిన 'రాజుగారి గది' విజయం సాధించినట్లుగా, నాగార్జున, సమంత గ్లామర్‌ యాడ్‌ అయినా 'రాజుగారి గది 2' మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అలాంటిది ఇప్పుడు 'మన్మధుడు 2'తో ఏం జరుగుతోందో చూడాలి మరి. ఈ సినిమాపై, తెలుగులో పూర్తి స్థాయి హీరోయిన్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తోన్న రకుల్‌ కొండంత ఆశలు పెట్టుకుంది. 

 

ఆ ఆశలు నెరవేరాలంటే 'మన్మధుడు 2' మంచి విజయం అందుకోవాలి. రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాకి దర్శకుడు. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లేటెస్ట్‌గా నేను.. 'నా మన్మధుడు 2 ఫ్యామిలీ.. లవింగ్‌ ఇట్‌ ..' అంటూ నాగార్జున ఆన్‌ లొకేషన్‌ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫోటోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS