ప్రచారంలో నారా వారబ్బాయ్‌ జోరు.!

మరిన్ని వార్తలు

'బాణం' సినిమాతో ఎంట్రీ ఇచ్చి విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్‌. కథనే కథానాయకుడిగా భావించి, విభిన్న కథల్లో నటించిన నటుడు నారా రోహిత్‌. కథలో విషయం ఉంటే చాలు, తన పాత్ర నిడివిని కూడా పట్టించుకోని సహజ నటుడు ఈ యంగ్‌ హీరో. అయితే ఈ మధ్య నారా రోహిత్‌ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పెదనాన్న​ చంద్రబాబుకు మద్దతుగా, టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాడు. 

 

వైసీపీ తీరును ఎండగడుతున్నాడు. ముగ్గురు దుష్టశక్తులు అంటూ నరేంద్రమోడీనీ, కేసీఆర్‌నీ, జగన్‌ని ఉతికి ఆరేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమంటున్నాడు. తనపై ఉన్న 32 కేసుల్ని మాఫీ చేసుకునేందుకే జగన్‌, మోడీకి కొమ్ము కాస్తున్నాడనీ, ఒకవేళ వైసీపీ గెలిస్తే పోలవరం ప్రాజెక్ట్‌ అర్ధాంతరంగా ఆగిపోతుందనీ ప్రజలకు సూచించారు నారా రోహిత్‌. 

 

చంద్రబాబు గెలిస్తే పోలవరం ప్రాజెక్ట్‌ ఏడాదిలో పూర్తయిపోతుందనీ ప్రచారంలో భాగంగా ప్రజల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నారా రోహిత్‌ 'పండగలా వచ్చాడు', 'శబ్ధం' సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయి. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌కి సెట్స్‌ మీదికి వెళ్లనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS