'సైరా' సర్‌ప్రైజ్‌ వచ్చేస్తోంది

మరిన్ని వార్తలు

సైరా సినిమా విడుదల పోస్ట్‌పోన్‌ అయ్యిందంటూ గాసిప్స్‌ వస్తున్నాయి. ఈ ఏడాది కూడా సైరా ప్రేక్షకుల ముందుకు రాదనీ, 2020 సంక్రాంతికి 'సైరా'ను పోస్ట్‌పోన్‌ చేశారంటూ ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గాసిప్స్‌లో నిజం లేదంటూ, ఈ విషయమై పూర్తిగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడట నిర్మాత చరణ్‌. త్వరలో విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారట. 

 

అంతేకాదు, మరో రెండు మూడు రోజుల్లోనే సైరా నుండి సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ రానుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. ఇప్పటికే సైరా నుండి పలు పాత్రల పరిచయాలు జరిగాయి. అదిరిపోయే టీజర్‌ విడుదలై అద్భుతాలు సృష్టించేసింది. ఇక ఇప్పుడు రానున్న సర్‌ప్రైజ్‌ ఎలా ఉండబోతోందో అంటూ అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌ ఇద్దరూ కలిసి ఈ సర్‌ప్రైజ్‌ని ప్లాన్‌ చేశారట. 

 

సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ' ఆశించిన రిజల్ట్‌ ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్‌ కాస్త డిజప్పాయింట్‌లో ఉన్నారు. సైరా అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం రేకెత్తించేందుకు చరణ్‌ రంగం సిద్ధం చేస్తున్నాడట. అయితే టీజర్‌ ఆల్రెడీ వచ్చేసింది. ఇక ట్రైలరే మిగిలి ఉంది. రిలీజ్‌ డేట్‌ ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు కాబట్టి ఇప్పుడప్పుడే ట్రైలర్‌ కాకుండా, సెకండ్‌ టీజర్‌లా ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇవ్వాలని సైరా టీమ్‌ అనుకుంటోందట. అదేంటనేది వేచి చూడాల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS