మెగా క్యాంపెయినింగ్‌ షురూ అయ్యింది.!

మరిన్ని వార్తలు

మెగా బ్రదర్‌ నాగబాబు మాట నిలబెట్టుకున్నారు. తన పిల్లల్ని ప్రచారంలో దించుతానన్నారు. దించారు. తాజాగా మెగా డాటర్‌ నిహారిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. నర్సాపురం నుండి పార్లమెంట్‌కి పోటీ చేస్తున్న తండ్రి నాగబాబు తరపున, భీమవరం నుండి ఎమ్యెల్యేగా బరిలోకి దిగిన బాబాయ్‌ తరపున నిహారిక ప్రచారంలో పొల్గొని అభిమానులను ఓట్లు అభ్యర్ధించింది. ప్రచారంలో పాల్గొన్న నిహారికకు అడుగడుగునా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్‌ అందుతోంది. 

 

ఇక తదుపరి మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌  ప్రచారం మిగిలి ఉంది. ప్రస్తుతం వరుణ్‌ ఓ సినిమా కోసం బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. ఆ శిక్షణ నిమిత్తం విదేశాల్లో ఉన్నాడు. ఆ ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని విదేశాల నుండి త్వరలోనే వరుణ్‌తేజ్‌ ఇండియాకి రానున్నాడు. ఆ వెంటనే తండ్రి, బాబాయ్‌ తరపున ప్రచారానికి రానున్నాడనీ తెలుస్తోంది. 

 

మరోవైపు సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు అర్జున్‌ తదితర మెగా హీరోలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారనే సమాచారమ్‌ ఉంది. అయితే చరణ్‌ ప్రచారానికి వస్తాడా.? లేదా.? అన్న విషయంలోనే సందిగ్థత నెలకొంది. అలాగే చిరంజీవి విషయంలోనూ క్లారిటీ లేదు. కానీ మెగా కోడలు ఉపాసన ఇద్దరు మామల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. చూడాలి మరి.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS