'చిత్రలహరి': తేజు ఫ్యాన్స్‌ ఫిక్స్‌ అయిపోయారు.!

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'చిత్రలహరి' విడుదలకు ముస్తాబైన సందర్భంగా చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేసింది. లేటెస్ట్‌గా సెన్సార్‌ బోర్డ్‌ 'క్లీన్‌ యు' సర్టిఫికెట్‌ ఇచ్చింది 'చిత్రలహరి'కి. ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ వచ్చిందంటేనే సినిమాకి పోజిటివ్‌ బజ్‌ వచ్చేసినట్లే. దాంతో ఈ సినిమాతో తేజు ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేయడం ఖాయమని తేజు ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు. 

 

ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ బేస్‌ చేసుకుని వచ్చిన 'ఎఫ్‌ 2' మంచి విజయం అందుకుంది. అదే కళ ఇప్పుడు 'చిత్రలహరి'కి కనిపిస్తోంది. టీజర్‌, ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి ఈ సారి తేజు గట్టిగానే కొట్టేలా ఉన్నాడు. కిషోర్‌ తిరుమల సినిమాలంటేనే ఎంత ప్లెజెంట్‌గా ఉంటాయో 'నేను శైలజ', 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలతో ప్రూవ్‌ అయ్యింది. 

 

ఇక ఇప్పుడు 'చిత్రలహరి'పై కూడా అదే అభిప్రాయం నెలకొంది. తేజుతో పాటు, సునీల్‌, వెన్నెల కిషోర్‌లు తమ టైమింగ్‌తో చక్కగా ఆకట్టుకోనున్నారు ఈ సినిమాతో. కళ్యాణీ ప్రియదర్శిన్‌, నివేదా పేతురాజ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న 'చిత్రలహరి' మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది 'చిత్రలహరి'. చూడాలి మరి తేజు ఈ సారైనా సక్సెస్‌ అవుతాడో.? లేదో.?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS