దగ్గుబాటి వారసులపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి..!

మరిన్ని వార్తలు

గత కొంతకాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉన్న శ్రీరెడ్డి మళ్ళీ తన కార్యకలాపాలను మొదలు పెట్టింది. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా తయారై.. గతంలో పలువురు సినీ ప్రముఖులపై.. ముఖ్యంగా దగ్గుబాటి వారసుడు అభిరామ్ పై తనదైన స్టైల్ లో కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు.. మళ్ళీ దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేసి అదే రేంజ్ లో వివాదాస్పదమైన ఆరోపణలు చేస్తుంది. 

 

తాజాగా శ్రీరెడ్డి ఫేస్ బుక్ అకౌంట్ లో ఓ షాకింగ్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది దగ్గుబాటి వారసులు రానా, అభిరామ్ ల గురించే. రానా హీరోయిన్ త్రిషని, అభిరామ్ శ్రీ రెడ్డిని ముద్దుపెట్టుకుంటున్న ఫోటోలను పెట్టి "పరువులు, కుటుంబాలు, వ్యక్తిగత వ్యవహారాలు, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఇలా ఊళ్ళో అమ్మాయిల మీదకి వదులుతున్నారా? సరసాల్లో చనిపోయిన తాతగారిని మించిపోయారు ఈ వారసులు... ఇలాంటి పనులన్నింటికీ అడ్డా రామానాయుడు స్టూడియోస్" అని సంచలన కామెంట్స్ పోస్ట్ చేసింది. 

 

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. 'శ్రీ రెడ్డి ఇలా చేయటం కరెక్ట్ పద్ధతి కాదు' అంటూ నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు. కాగా, కాస్టింగ్ కౌచ్ పేరుతో జరిగిన సంచలనాల తర్వాత శ్రీ రెడ్డి మొదటిసారిగా 'లక్ష్మీస్  వీరగ్రంధం' సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో నటిస్తుంది. కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ సాంగ్ టీజర్ కూడా విడుదలయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS