సెంటిమెంట్‌కే తలొగ్గిన 'మహర్షి'.!

మరిన్ని వార్తలు

మహేష్‌బాబు తాజా చిత్రం 'మహర్షి' రిలీజ్‌ డేట్‌ మారిపోయింది. ఏప్రిల్‌ 25న ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసి తీరతామన్న 'మహర్షి' టీమ్‌ పట్టు వీడింది. ప్రచారం జరిగినట్లుగానే రిలీజ్‌ డేట్‌ మార్చుకుంది. దిల్‌రాజు, అశ్వనీదత్‌, పీవీపీ సినిమాస్‌ బ్యానర్‌లో సంయుక్తంగా రూపొందుతోన్న 'మహర్షి' సినిమా రిలీజ్‌ డేట్‌ని సెంటిమెంట్‌ పరంగా మేకి మార్చామని నిర్మాత దిల్‌రాజు తాజాగా ప్రకటించారు. 

 

మే 9న వరల్డ్‌ వైడ్‌గా 'మహర్షి' రిలీజ్‌ కానుందని ఆయన సోషల్‌ మీడియా ద్వారా అనౌన్స్‌ చేశారు. గతంలో అశ్వనీదత్‌ రూపొందించిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి', లేటెస్ట్‌ మూవీ 'మహానటి' మేలో రిలీజై అద్భుత విజయాల్ని అందుకున్నాయి. అలాగే మా బ్యానర్‌లో రూపొందిన 'పరుగు', 'భద్ర' సినిమాలు కూడా మేలోనే రిలీజయ్యాయి. అదే సెంటిమెంట్‌ని ఈ సినిమాకి కూడా ఫాలో చేస్తున్నామనీ రాజుగారు తెలిపారు. 

 

ఎట్టకేలకు 'మహర్షి' సినిమా రిలీజ్‌ డేట్‌పై ఉన్న అనుమానాలు పటాపంచలైపోయాయి. ఇక అతి త్వరలో ఫ్యాన్స్‌కి 'మహర్షి' నుండి ప్రెష్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు టీమ్‌ సన్నాహాలు చేస్తోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. మహేష్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా, అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. క్రేజీ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS