'తలైవి' కంగనా: ఆ గాసిప్‌లో నిజం లేదు.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ క్వీన్‌, ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో 'తలైవి' మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. కాగా ఈ సినిమాకి కంగనా అత్యంత భారీ రెమ్యునరేషన్‌ అందుకుంటోందనీ ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఆ అమౌంట్‌ అక్షరాలా 24 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి సంబంధించి లేటెస్ట్‌గా ఈ సినిమా నిర్మాత అయిన విష్ణు ఇందూరి స్పందించారు. 

 

రెమ్యునరేషన్‌ విషయం సినిమాలో నటించే నటీటులకు, నిర్మాతలకు మధ్య విషయం.. ఆ విషయాన్ని మేం అధికారికంగా బయట పెట్టలేం.. అని ఆయన తెలిపారు. అంతేకాదు అది జస్ట్‌ గాసిప్‌ మాత్రమే. అందులో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌కీ ఈయనే నిర్మాతగా వ్యవహరించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ కూడా రెమ్యునరేషన్‌ భారీగా అందుకున్న సంగతి తెలిసిందే. 

 

తాజాగా కంగనా ఇప్పుడు ఆ లిస్టులో చేరింది. కంగనాతో సినిమా చేయడమంటే అంత ఆషామాషీ కాదు. ఈ మధ్య 'మణికర్ణిక' విషయంలో తెలుగు డైరెక్టర్‌ క్రిష్‌కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. మరి విష్ణు ఇందూరి కూడా కంగనా విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలంటూ టాలీవుడ్‌ ప్రముఖులు సూచిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తుండగా, విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS