ఎమ్మెల్యే రోజా ఇంట్లో భారీ దొంగతనం

మరిన్ని వార్తలు

సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఈరోజు భారీ దొంగతనం జరిగింది. మణికొండ లో నివసిస్తున్న రోజా ఇంట్లో సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దుండగులు ఎత్తుకెళ్లారు.

తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు రోజా ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రోజా ఫిర్యాదు తో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఇంట్లో తెలిసిన వారే ఈ చోరీ కి పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

బీరువాలో పెట్టిన 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎలా అపహరణకు గురయ్యాయో అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంట్లో పనిచేసే వాళ్ళే ఈపని చేశారా, లేక బయటివాళ్ళు ఎవరైనా వచ్చి దొంగతనం చేశారా.. అనే విషయంపై దర్యాప్తు జరుగుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS