బన్నీ క్లారిటీ ఇచ్చేశాడు.!

మరిన్ని వార్తలు

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన బన్నీ తదుపరి చిత్రం విషయంలో కన్‌ఫ్యూజన్‌ వదిలేశాడు. పలువురి డైరెక్టర్లను పరిశీలించిన బన్నీ ఎట్టకేలకు త్రివిక్రమ్‌కి ఫిక్సయ్యాడు. త్రివిక్రమ్‌తోనే తన తదుపరి చిత్రం ఉండబోతోందని అఫీషియల్‌గా ప్రకటించేశాడు. బన్నీ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' రెండు సినిమాలూ సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందుకున్నాయి. 

 

సో ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ హ్యాట్రిక్‌ కొట్టేందుకే రంగం సిద్ధం చేసినట్లుంది. 2019 జనవరిలో ఈ కొత్త సినిమాని లాంఛనంగా ప్రారంభించినున్నామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సర్‌ప్రైజింగ్‌తో న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేసేశాడు బన్నీ. గీతా ఆర్ట్స్‌, హారికా హాసినీ బ్యానర్‌లలో అల్లు అరవింద్‌, రాధాక్రిష్ణ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు. త్రివిక్రమ్‌కీ, బన్నీకి ఈ సినిమా ప్రతిష్ఠాత్మకం కానుంది. 

 

ఇద్దరూ ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్‌ కొట్టి తీరాలి. ఈ కాంబినేషన్‌ అంటే ఇటు బన్నీ ఫ్యాన్స్‌లోనూ, అటు త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌లోనూ అంచనాలు బాగా ఉంటాయి. ఆ అంచనాల్ని అందుకుంటారో లేదో చూడాలి మరి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ అయ్యాయట. అతి త్వరలోనే హీరోయిన్‌, ఇతర టెక్సీషియన్స్‌ వివరాలు వెల్లడించనున్నారు. మొత్తానికి బన్నీ న్యూ ఇయర్‌కి ఒక రోజు ముందుగానే ఫ్యాన్స్‌కి బెస్ట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చేశాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS