బాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్న 'మహానటి'.!

మరిన్ని వార్తలు

'మహానటి' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్‌ త్వరలో బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. అజయ్‌ దేవగణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. 'బదాయి హో' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అమిత్‌ శర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాగా సౌత్‌ నుండి బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మల లిస్టులో ఇప్పుడు కీర్తిసురేష్‌ కూడా చేరిపోయింది. 

 

సౌత్‌లో స్టార్‌ హీరోయిన్లుగా పేరు పొందిన తమన్నా, కాజల్‌ అగర్వాల్‌ హిందీలో అజయ్‌దేవగణ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. కానీ అందులో తమన్నా ఫెయిల్యూర్‌ చవి చూసింది. కాజల్‌ జస్ట్‌ ఓకే అనిపించుకుంది. 'అఖిల్‌'తో తెలుగులో పరిచయమైన సాయేషా కూడా హిందీలో అజయ్‌దేవగణ్‌తో నటించింది. కానీ విజయం అందుకోలేకపోయింది. 

 

ఇక ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా అజయ్‌దేవగణ్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌లో ఉంది. రకుల్‌ అదృష్టం ఎలా ఉండబోతోందో. ఆల్రెడీ 'అయ్యారీ'తో రకుల్‌ బాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చినా సరైన హిట్‌ కొట్టలేకపోయింది. మరి ఈ సారేం చేస్తుందో కానీ, బాలీవుడ్‌లో ఛాన్స్‌ దక్కించుకున్నందుకు కీర్తి ఆనందంతో ఊగిపోతోందట. అయితే సౌత్‌ నుండి ఎంట్రీ ఇచ్చిన భామల్లో కీర్తిసురేష్‌కి బాలీవుడ్‌లో బోణీ లక్కు తెచ్చిపెడుతుందో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS