కాజల్‌ గ్లామర్‌కి ఫిదా అయిన 'భరత్‌' భామ.!

మరిన్ని వార్తలు

అదేంటో బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ భామల్ని చూసి ఇంప్రెస్‌ అయిపోతున్నారు. అదేదో ప్రొఫిషన్‌ కోసం కాదండోయ్‌. నిన్న కాక మొన్న బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌, టాలీవుడ్‌ భామ రెజీనాతో రొమాన్స్‌ చాలా బాగుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడేమో 'భరత్‌' బ్యూటీ కియారా అద్వానీ, చందమామ కాజల్‌ గ్లామర్‌కి ఫిదా అయిపోయానంటోంది. చూస్తుంటే ఇదేదో తేడాగానే ఉందండోయ్‌. అసలే ఈ 'తేడా' అనే మాటకి అర్ధమే మారిపోయిందిప్పుడు. 

 

ఇంతకీ అసలు విషయమేంటంటే, తెలుగులో వరుసగా బిగ్‌ ఆఫర్స్‌తో దూసుకెళ్తోన్న కియారా అద్వానీకి తెలుగు ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎంత బిజీగా ఉన్నా తెలుగు సినిమాలను అస్సలు వదులుకోనని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు, తెలుగు సినిమాలతోనే తన కెరీర్‌ గోల్డెన్‌ టర్న్‌ తీసుకుందని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. అలా తెలుగు సినిమాలపై తెలియకుండానే అభిమానం పెంచేసుకుందట కియారా అద్వానీ

 

ఖాళీ దొరికినప్పుడల్లా తెలుగు సినిమాలను చూసేస్తోందట. అలా 'మగధీర' సినిమా చూసినప్పుడు అందులో కాజల్‌ చాలా అందంగా ఉంది. ఆ అందానికి ఫిదా అయిపోయానని చెప్పిన సందర్భమే ఇది. హా.! అంతేలెండి. ఇక సోనమ్‌కపూర్‌ అంటారా.? రెజీనా, సోనమ్‌ కలిసి 'ఏక్‌ లడ్‌కీ కో దేఖ్‌తా..' సినిమాలో నటించారు. లెస్బియన్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనాతో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌ గురించి ఫన్నీగా సోనమ్‌ అలా స్పందించిందన్న మాట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS