రకుల్‌తో రిస్క్‌: నో బాస్‌ అంటోన్న టాలీవుడ్‌.?

మరిన్ని వార్తలు

ఒక్క మెసేజ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ తనపై ఉన్న క్రేజ్‌ని పూర్తిగా డ్యామేజ్‌ చేసేసుకుంది. సెలబ్రిటీలన్నాక సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడతారు. ఆ పోస్ట్‌లు చూసిన నెటిజన్లు కామెంట్స్‌ కూడా పెడతారు. అలా అని హద్దులు దాటి ప్రవర్తిస్తే ఎవరికి నష్టం.? ఖచ్చితంగా సెలబ్రిటీలకే అని రకుల్‌ విషయంలో ప్రూవ్‌ అయ్యింది. ఈ మధ్య రకుల్‌ డ్రస్సు విషయంలో ఓ నెటిజన్‌ పెట్టిన కామెంట్‌కి వెనకా ముందూ ఆలోచించకుండా రకుల్‌ ఇచ్చిన రెస్పాన్స్‌ ఆమెకు చాలా డ్యామేజీనే చేసిందనాలి. 

 

టాలీవుడ్‌ రీ ఎంట్రీలో అప్పుడప్పుడే ఒకటీ అరా ఆఫర్లు అందుతున్న టైంలో చేతులారా ఆ అవకాశాల్ని చేజార్చుకోవడానికి రకుల్‌కి ఆ పోస్ట్‌ ఓ కారణమైందనడం సబబే అవుతుంది. రకుల్‌కి తమ సినిమాల్లో ఛాన్స్‌ ఇచ్చే రిస్క్‌ తెలుగు దర్శక, నిర్మాతలు చేయాలనుకోవడం లేదనీ టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అయితే 'మన్మధుడు 2'లో నాగార్జున సరసన హీరోయిన్‌గా రకుల్‌ని ఎంచుకున్నారంటూ మరోసారి ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ప్రచారం మాత్రమే. ఇందులో ఎంతవరకూ నిజముందనేది క్లారిటీ లేదు. 

 

కానీ దొరక్క దొరక్క దొరికిన ఛాన్స్‌ అయినా కానీ ఫుల్‌గా క్యాష్‌ చేసేసుకోవాలని అనుకుంటోందట రకుల్‌ ప్రీత్‌సింగ్‌. సీనియర్‌ హీరో కాబట్టి భారీగా రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేస్తోందనీ సమాచారమ్‌. అయినా అంత భారీ రెమ్యునరేషన్‌ ఇచ్చి కాంట్రవర్సీల్లో మునిగి తేలుతున్న రకుల్‌ని ఎందుకు తీసుకోవాలా.? కొత్త భామను తీసుకుంటే ఫ్రెష్‌ ఫీల్‌ ఉంటుందనే యోచనలో 'మన్మధుడు 2' టీమ్‌ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. అసలే ఆ లిస్టులో పాయల్‌ రాజ్‌పుత్‌ పేరు పరిశీలనలో ఉన్నదాయె.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS