'ఇస్మార్ట్‌' సీక్వెల్‌ వెనుక అసలు 'కథ' ఇదీ.!

మరిన్ని వార్తలు

డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ ప్రస్తుతం 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి సీక్వెల్‌ అంటూ 'డబుల్‌ ఇస్మార్ట్‌' అనే టైటిల్‌ని పూరీ ఇటీవల రిజిస్టర్‌ చేయించిన సంగతి తెలిసిందే. ఇంతకీ డబుల్‌ ఇస్మార్ట్‌ని పూరీ ఎందుకు అనౌన్స్‌ చేశాడంటే, 'ఇస్మార్ట్‌ శంకర్‌' స్టోరీ స్పాన్‌ ఎక్కువైందట. దాంతో సీక్వెల్‌ ప్లాన్‌ చేశాడట. అయితే ఈ డబుల్‌ ఇస్మార్ట్‌లో హీరోయిన్లు మారే అవకాశముందని తెలుస్తోంది.

 

'ఇస్మార్ట్‌ శంకర్‌' కోసం నిధి అగర్వాల్‌నీ, నభా నటేష్‌నీ హీరోయిన్లుగా ఎంచుకున్న పూరీ జగన్నాధ్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ కోసం కొత్త భామలకు ఛాన్సివ్వనున్నాడనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. పూరీ జగన్నాధ్‌ సినిమాలు చాలా వేగంగా రూపొందుతాయి. సో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి త్వరలోనే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయనున్నాడట పూరీ. 

 

'ఇస్మార్ట్‌ శంకర్‌' రిలీజ్‌ తర్వాత ఆరు నెలలలోపే సీక్వెల్‌ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఏది ఏమైనా పూరీ అంతే. ఏం చేసినా ఇస్మార్ట్‌గానే చేస్తాడు. ఈ రెండు సినిమాలూ పూరీ సొంత బ్యానర్‌ అయిన పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లోనే రూపొందనున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS