విక్రమ్‌ సహిదేవ్‌ అదరగొట్టేశాడట.!

మరిన్ని వార్తలు

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయమైన కుర్రాడు విక్రమ్‌ సహిదేవ్‌. హీరోగా 'ఎవడు తక్కువ కాదు' సినిమాతో రాబోతున్నాడు. రఘు జయ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. కన్నడలో మంచి విజయం సాధించిన 'గోలీసోడా' సినిమాని తెలుగులో 'ఎవడు తక్కువ కాదు' టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. నిజానికి ఇది తమిళ సినిమాకి కన్నడ రీమేక్‌. ఆ కన్నడ మూవీని తెలుగులో డబ్‌ చేస్తున్నారిప్పుడు. ఇకపోతే హీరోగా నటించిన విక్రమ్‌ సహిదేవ్‌ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడీ యంగ్‌స్టర్‌ టాలీవుడ్‌ని బాగా ఆకర్షిస్తున్నాడు. 

 

తాజాగా ఈ సినిమా ప్రివ్యూని ప్రదర్శించారు. అతి కొద్ది మంది సినీ ప్రముఖుల కోసం ప్రదర్శించిన ఈ ప్రివ్యూ చూసినవారు విక్రమ్‌ సహిదేవ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నటుడిగా విక్రమ్‌కి మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు. నిజానికి ఈ విక్రమ్‌ సహిదేవ్‌ ఎవరో తెలుసా.? ఈ మధ్య అల్లు అర్జున్‌ నటించిన 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అన్వర్‌ పాత్రలో యంగ్‌ లుక్స్‌తో ఆకట్టుకున్న కుర్రోడే ఈ విక్రమ్‌. కొద్ది సమయమే కనిపించినా ఆ సినిమాలో విక్రమ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

 

గతంలో 'రుద్రమదేవి' తదితర సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి, స్టార్‌ హీరోలుగా పేరు తెచ్చుకున్న వారు చాలా మందే ఉన్నారు టాలీవుడ్‌లో. ముఖ్యంగా మహేష్‌బాబు పేరు ఆ వరుసలో ముందుంటుంది. అలాగే అన్వర్‌కి కూడా మంచి భవిష్యత్తుందంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఎవడు తక్కువ కాదు' సినిమాతో హీరోగా విక్రమ్‌ ఆడియన్స్‌ నుండి ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటాడో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS