ఈ సారి 'బాహుబలి' పైనే కన్నేశాడట.?

మరిన్ని వార్తలు

ఇటీవల తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయం అందుకున్న కన్నడ సినిమా 'కేజీఎఫ్‌'. ప్రచార చిత్రాలతోనే అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించి, విడుదలయ్యాక వసూళ్లలో రికార్డులు సృష్టించింది. బాహుబలి తర్వాత అంత గొప్పగా చర్చించుకున్న సినిమా ఇదే. ఇక ఈ సినిమాకి తాజాగా సీక్వెల్‌ రూపొందబోతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాని గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. కన్నడ నటుడు యష్‌ హీరోగా నటించిన ఈ సినిమా సీక్వెల్‌ని మొదటి పార్ట్‌కి మించిన స్థాయిలో నిర్మించనున్నారట. 

 

తొలి పార్ట్‌తో నాన్‌ బాహుబలి రికార్డుల్ని కొల్లగొట్టిన హీరో యష్‌, సీక్వెల్‌తో బాహుబలిని కొట్టేయాలన్న కసితో ఉన్నాడట. టెక్నికల్‌ వేల్యూస్‌ దగ్గర నుండీ, కాస్టింగ్‌ వరకూ అంతా భారీ స్థాయిలో ఉండబోతున్నాయనీ తెలుస్తోంది. మొదటి పార్ట్‌ని తెరకెక్కించిన ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వారాహి బ్యానర్‌లో రూపొందుతోంది. మొదటి పార్ట్‌లో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధీ శెట్టి ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. 

 

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు, తమిళ భాషల నుండి కూడా ప్రముఖ నటీ నటులతో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇప్పించే యోచనలో 'కేజీఎఫ్ 2' టీమ్‌ ఉన్నట్లు తాజాగా తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించేందుకు ఆయా భాషల నుండి నటులు సిద్ధంగా ఉన్నారనీ సమాచారమ్‌. ఆల్రెడీ వారితో క్యారెక్టర్స్‌ విషయమై చర్చలు జరుగుతున్నాయట. మిగిలిన వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుందని తెలుస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS